విజయవాడ కలెక్టరేట్ ఎదట… వామపక్షాల ఆందోళన

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రైతులు రోడ్లమీదరకు వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధులు పాల్గొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు […]

Update: 2020-09-25 01:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రైతులు రోడ్లమీదరకు వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధులు పాల్గొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కలెక్టరేట్‌కు చేరుకొని, నిరసన కారులను, రైతులను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News