బీజేపీ దరఖాస్తుల ఉద్యమంపై కేటీఆర్ సెటైర్

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్‌లో ‘దరఖాస్తుల ఉద్యమాన్ని’ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరాడు. ‘‘దేశవ్యాప్తంగా ప్రతీ పౌరుడికి రూ. 15 లక్షలు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు బీజేపీ తెలంగాణ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. తెలంగాణ ప్రజలు, యువకులు అందరూ తెలంగాణ […]

Update: 2021-08-16 23:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్‌లో ‘దరఖాస్తుల ఉద్యమాన్ని’ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరాడు. ‘‘దేశవ్యాప్తంగా ప్రతీ పౌరుడికి రూ. 15 లక్షలు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు బీజేపీ తెలంగాణ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. తెలంగాణ ప్రజలు, యువకులు అందరూ తెలంగాణ బీజేపీ నేతలకు దరఖాస్తులు ఇవ్వండి. మీ జన్‌ధన్ అకౌంట్లలోకి డబ్బులు వస్తాయి’’ అని సెటైర్ వేశారు.

https://twitter.com/KTRTRS/status/1427464138775678980?s=20

Tags:    

Similar News