కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

దిశ, కరీంనగర్: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ రూ. 5,000 అదనపు వేతనం ప్రకటించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ కార్మికులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం తమ సేవలను గుర్తించినందుకు కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మున్సిపల్ కార్మికులకు రూ. 5 వేల చొప్పున బోనస్ ప్రకటించడం హర్షించదగ్గ […]

Update: 2020-04-07 07:56 GMT

దిశ, కరీంనగర్: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ రూ. 5,000 అదనపు వేతనం ప్రకటించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ కార్మికులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం తమ సేవలను గుర్తించినందుకు కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మున్సిపల్ కార్మికులకు రూ. 5 వేల చొప్పున బోనస్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్మికులు కూడా సీఎం తమకు సముచిత న్యాయం చేశారని భావిస్తున్నారని చెప్పారు.

Tags: corona out break, sanitation workers, cm kcr give to bonus

Tags:    

Similar News