కాట్రపల్లి అక్రమాలపై ఇంటెలిజెన్స్ ఆరా..!

దిశ, పరకాల: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లి అంజలి వీవో గ్రూప్ నిర్వహించిన ఐకేపీ సెంటర్లో ఎంపీటీసీ భర్త అజ్మీర రఘు సింగ్ అక్రమాలకు పాల్పడినట్లు ఈ నెల 9వ తేదీన ‘దిశ’ పత్రికలో ఆధారాలతో వార్తా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులు కీలక ఆధారాలు స్వీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు, రైతుల వాంగ్మూలంతో పాటు అవినీతికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. […]

Update: 2021-11-23 07:49 GMT

దిశ, పరకాల: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లి అంజలి వీవో గ్రూప్ నిర్వహించిన ఐకేపీ సెంటర్లో ఎంపీటీసీ భర్త అజ్మీర రఘు సింగ్ అక్రమాలకు పాల్పడినట్లు ఈ నెల 9వ తేదీన ‘దిశ’ పత్రికలో ఆధారాలతో వార్తా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులు కీలక ఆధారాలు స్వీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు, రైతుల వాంగ్మూలంతో పాటు అవినీతికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. డీఆర్డీఏ పీడీ సైతం విచారణకు ఆదేశించినట్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ జరిగిన దాఖలాలు కనబడకపోవడం, ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ వర్గాలు అక్రమాలపై ఆరా తీయడం చూస్తుంటే రఘుసింగ్ అక్రమాల బాగోతం ఏ మలుపు తిరగనుందో వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News