వార్నింగ్‌లు ఇస్తే నడవదు.. టీఆర్ఎస్ నేతలకు చురకలు..

దిశ, వెబ్ డెస్క్ : టీఆర్ఎస్ నేతల అహంకారం తగ్గాలంటే.. వారి ప్రభుత్వం అధికారంలో ఉండకూడదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. సంజయ్ ఈరోజు మీడయాతో మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతేనే ఆ పార్టీ నేతలకు అహంకారం దిగిపొతుందని విమర్శించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ప్రజలు పట్టభద్రుల తీర్పు కోసం వేచి చూస్తున్నారని అన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అహంకారం తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. […]

Update: 2021-03-06 04:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : టీఆర్ఎస్ నేతల అహంకారం తగ్గాలంటే.. వారి ప్రభుత్వం అధికారంలో ఉండకూడదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. సంజయ్ ఈరోజు మీడయాతో మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతేనే ఆ పార్టీ నేతలకు అహంకారం దిగిపొతుందని విమర్శించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ప్రజలు పట్టభద్రుల తీర్పు కోసం వేచి చూస్తున్నారని అన్నారు.

ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అహంకారం తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రజలను బెదిరించి వార్నింగ్‌లు ఇస్తే నడవదని హెచ్చరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పేరు చెప్పి శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవి పొందారని విమర్శలు చేశారు. ఎవరి సంగతి ఏంటో.. అంతా మాకు తెలుసని.. రానున్న కాలంలో తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు.

 

Tags:    

Similar News