మృతదేహంపై నగలు మాయం

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం ఓ మహిళ మృతి చెందింది. ఆమె ట్రీట్‌మెంట్ పొందుతున్న సమయంలో శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు మరణించాక మాయమయ్యాయి. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన బంధువులు గమనించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలోనే దొంగతనం జరిగిందా.. లేదా ఇంకెవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన […]

Update: 2020-08-02 04:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
హైదరాబాద్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం ఓ మహిళ మృతి చెందింది. ఆమె ట్రీట్‌మెంట్ పొందుతున్న సమయంలో శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు మరణించాక మాయమయ్యాయి.

మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన బంధువులు గమనించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలోనే దొంగతనం జరిగిందా.. లేదా ఇంకెవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News