రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్‌గా గజ్జల లక్ష్మి

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త గజ్జల లక్ష్మికి ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆమె సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మహిళా కమిషన్ మెంబర్‌గా ప్రభుత్వం తనపై ఉంచిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఆమె తెలిపారు. ఇకపోతే గజ్జల లక్ష్మి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త. మాటల తూటాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడమే కాదు.. పార్టీ […]

Update: 2021-08-03 08:06 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త గజ్జల లక్ష్మికి ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆమె సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మహిళా కమిషన్ మెంబర్‌గా ప్రభుత్వం తనపై ఉంచిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఆమె తెలిపారు. ఇకపోతే గజ్జల లక్ష్మి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త. మాటల తూటాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడమే కాదు.. పార్టీ కోసం అనుక్షణం శ్రమించింది. ఒకప్పుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి జగన్‌పై విరుచుకుపడితే దానికి చాలా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చి వార్తల్లో హల్‌చల్ చేసింది.

Tags:    

Similar News