‘గ్రోమోర్’ ఎదుట రైతుల ఆందోళన

దిశ, బాన్సువాడ: మొలకెత్తని వరి విత్తనాలను అంటగట్టారని రైతులు ఆందోళన చేపట్టారు. బీర్కూర్ మండల కేంద్రంలోని గ్రోమోర్ దుకాణం ముందు సోమవారం నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన రైతులు గ్రోమోర్ దుకాణంలో వరి విత్తనాలను కొనుగోలు చేశారు. అయితే పది శాతం కూడా మొలకెత్తక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు నకిలీ విత్తనాలను అంటగట్టిన గ్రోమోర్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయమై అగ్రికల్చర్ అధికారి […]

Update: 2020-06-22 02:56 GMT

దిశ, బాన్సువాడ: మొలకెత్తని వరి విత్తనాలను అంటగట్టారని రైతులు ఆందోళన చేపట్టారు. బీర్కూర్ మండల కేంద్రంలోని గ్రోమోర్ దుకాణం ముందు సోమవారం నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన రైతులు గ్రోమోర్ దుకాణంలో వరి విత్తనాలను కొనుగోలు చేశారు. అయితే పది శాతం కూడా మొలకెత్తక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు నకిలీ విత్తనాలను అంటగట్టిన గ్రోమోర్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయమై అగ్రికల్చర్ అధికారి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. సమస్య తన దృష్టికి వచ్చిందని రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు.

Tags:    

Similar News