అజ్ఞాతంలోకి మాజీ మంత్రి?

దిశ, ఏపీ‌బ్యూరో: ఏపీలో సంచలనం సృష్టించిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్యలో కీలక పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చిన పోలీసులు, ఈ రోజు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇప్పటికే కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఆయన కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇక మోకా భాస్కరావు కుటుంబ సభ్యులు కూడా కొల్లు రవీంద్రపైనే ఆరోపణలు చేస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలంటూ మచిలీపట్నంలో […]

Update: 2020-07-03 06:12 GMT

దిశ, ఏపీ‌బ్యూరో: ఏపీలో సంచలనం సృష్టించిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్యలో కీలక పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చిన పోలీసులు, ఈ రోజు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇప్పటికే కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఆయన కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇక మోకా భాస్కరావు కుటుంబ సభ్యులు కూడా కొల్లు రవీంద్రపైనే ఆరోపణలు చేస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలంటూ మచిలీపట్నంలో నిరసన వ్యక్తం చేశారు. తన భర్త ఎదుగుదలను చూసి ఓర్వలేక కొల్లు రవీంద్ర హత్య చేయించడాన్ని భాస్కరరావు భార్య తీవ్ర ఆరోపణలు చేసింది.

Tags:    

Similar News