మరణంలోనూ వీడని బంధం.. గంట వ్యవధిలోనే..

దిశ, వెబ్‌డెస్క్ : భార్యభర్తల బంధం విడదీయలేనిది అంటారు. చివరిదాక తోడు ఉంటాను అంటూ పెళ్లిలో ప్రమాణం చేస్తారు. అయితే గుంటూరు జిల్లాలో పెళ్లిలో చేసిన ప్రమాణంను నిజం చేశారు ఓ జంట. మరణంలోనూ మూడు ముళ్లబంధంను విడవలేదు ఓ వృద్ధదంపతుల జంట. జిల్లాలోని మంగళ గిరిలో గంటల వ్యవధిలోనే వృద్ధదంపతులు మృతి చెందిన ఘటన అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. యర్రబాలెంకి చెందిన అక్కిరెడ్డి వీర్రాజు (85) , భార్య రాఘవమ్మ(69) భార్యభర్తలు. అనారోగ్యంతో […]

Update: 2021-11-30 21:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భార్యభర్తల బంధం విడదీయలేనిది అంటారు. చివరిదాక తోడు ఉంటాను అంటూ పెళ్లిలో ప్రమాణం చేస్తారు. అయితే గుంటూరు జిల్లాలో పెళ్లిలో చేసిన ప్రమాణంను నిజం చేశారు ఓ జంట. మరణంలోనూ మూడు ముళ్లబంధంను విడవలేదు ఓ వృద్ధదంపతుల జంట. జిల్లాలోని మంగళ గిరిలో గంటల వ్యవధిలోనే వృద్ధదంపతులు మృతి చెందిన ఘటన అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. యర్రబాలెంకి చెందిన అక్కిరెడ్డి వీర్రాజు (85) , భార్య రాఘవమ్మ(69) భార్యభర్తలు. అనారోగ్యంతో భార్య రాఘవమ్మ మంగళవారం రాత్రి మృతి చెందింది. దాంతో భార్య మృతిని తట్టుకోలేని వీర్రాజు ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే వృద్ధదంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాధ ఛాయలు కమ్ముకున్నాయి.

Tags:    

Similar News