ప్రొఫెసర్ జయశంకర్ వర్సీటీలో పీజీ ప్రోగ్రామ్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం..Latest Telugu News
దిశ, కెరీర్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.. హైదరాబాద్ (రాజేంద్రనగర్, సైఫాబాద్), జగిత్యాల, సంగారెడ్డిలోని వ్యవసాయ కళాశాలల్లో మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్- సీట్ల వివరాలు:
ఎంఎస్సీ (అగ్రికల్చర్)-111 సీట్లు
ఎంబీఏ (అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్) - 16 సీట్లు
ఎంటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) - 6 సీట్లు.
ఎంఎస్సీ (కమ్యూనిటీ సైన్స్): 17 సీట్లు
అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: డిసెంబర్ 31, 2022 నాటికి 40 ఏళ్లు మించరాదు.
ఎంపిక: ఐసీఏఆర్ - ఏఐఈఈఏ (పీజీ) 2022 స్కోరు, తదితరాల ఆధారంగా..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: డిసెంబర్ 1, 2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: డిసెంబర్ 3, 2022.
వెబ్సైట్: https://www.pjtsau.edu.in