ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంచలన నిర్ణయం

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ వేటు వేశారు. నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారనీ..ఇతర ఉద్యోగులను కూడా సెలవుపై వెళ్లేలా ఆయన తీవ్రంగా ప్రభావితం చేశారని జీవీ ప్రసాద్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవీ ప్రసాద్‌ను విధుల నుంచి తప్పిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 9 నుంచి ఎన్నికల కమిషన్ […]

Update: 2021-01-11 05:18 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ వేటు వేశారు. నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారనీ..ఇతర ఉద్యోగులను కూడా సెలవుపై వెళ్లేలా ఆయన తీవ్రంగా ప్రభావితం చేశారని జీవీ ప్రసాద్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవీ ప్రసాద్‌ను విధుల నుంచి తప్పిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 9 నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని సీనియర్ ఉద్యోగులు ఎవరూ సెలవులు తీసుకోరాదని ఎస్ఈసీ ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News