17 లక్షలకు చేరువలో కరోనా కేసులు

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దాని కరాళ నృత్యానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో 57,118 కొత్త కేసులు నమోదయ్యాయి. 764 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 16 లక్షల 95 వేల 988కు చేరింది. ఇందులో 10,94,374 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశార్జ్ అయ్యారు. 5 లక్షల 65 వేల 103 మంది బాధితులు […]

Update: 2020-07-31 22:45 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దాని కరాళ నృత్యానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో 57,118 కొత్త కేసులు నమోదయ్యాయి. 764 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 16 లక్షల 95 వేల 988కు చేరింది.

ఇందులో 10,94,374 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశార్జ్ అయ్యారు. 5 లక్షల 65 వేల 103 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 36,511 కు చేరింది.

Tags:    

Similar News