‘అమ్మవారి ఆగ్రహంతో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం’

దిశ, అలంపూర్: జోగులాంబ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్.. అమ్మవారి ఆగ్రహానికి గురై శేష జీవితాన్ని జైలులో గడుపుతారని కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌లు జోస్యం చెప్పారు. సోమవారం అలంపూర్‌లోని హరిత హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రేపు మంత్రి కేటీఆర్ గద్వాల జిల్లా పర్యటన సందర్భంగా అనేక సమస్యలప్తె టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గత తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రకటించిన.. జోగులాంబ గద్వాల జిల్లా […]

Update: 2021-09-13 09:26 GMT

దిశ, అలంపూర్: జోగులాంబ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్.. అమ్మవారి ఆగ్రహానికి గురై శేష జీవితాన్ని జైలులో గడుపుతారని కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌లు జోస్యం చెప్పారు. సోమవారం అలంపూర్‌లోని హరిత హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రేపు మంత్రి కేటీఆర్ గద్వాల జిల్లా పర్యటన సందర్భంగా అనేక సమస్యలప్తె టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గత తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రకటించిన.. జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు వంద పడకల అస్పత్రి, తుమ్మిల ఎత్తిపోతల పథకం, గట్టు ఎత్తిపోతల పథకం, గద్వాల, అలంపూర్లకు ఆర్టీసీ బస్టాండ్లు, చేనేత పార్కుల నిర్మాణాలు ఎక్కడ అంటూ నిలదీశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి.. ఆ పదవిలో కూర్చొని ఏడేళ్లుగా మోసం చేస్తున్నారని పొన్నల లక్ష్మయ్య, సంపత్ కుమార్‌లు విమర్శలు చేశారు.

Tags:    

Similar News