‘దిశ ఎఫెక్ట్’.. చెరువులో సెల్ టవర్‌ను తరలించిన ఆ సంస్థ..

దిశ, హైదరాబాద్: చెరువులో సెల్ టవర్ శీర్షికతో దిశ హైదరాబాద్ ఎడిషన్‌లో ఇటీవల ఓ వార్త ప్రచురితం అయింది. ఆ వార్త నేపథ్యంపై సదరు టెలిఫోన్ టవర్ సంస్థ ప్రతినిధులు స్పందించారు. హైదర్ నగర్ డివిజన్‌లోని అంబిర్ చెరువులో వేసిన జియో సెల్ టవర్ పై దిశ సమగ్ర వార్తా కథనాన్ని ప్రచురించింది. దీనిపై బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, వెలగ శ్రీనివాస్ ఇతర బీజేపీ నాయకులు నిజనిర్దారణ చేశారు. అలాగే సెల్ టవర్ […]

Update: 2021-11-11 05:36 GMT

దిశ, హైదరాబాద్: చెరువులో సెల్ టవర్ శీర్షికతో దిశ హైదరాబాద్ ఎడిషన్‌లో ఇటీవల ఓ వార్త ప్రచురితం అయింది. ఆ వార్త నేపథ్యంపై సదరు టెలిఫోన్ టవర్ సంస్థ ప్రతినిధులు స్పందించారు. హైదర్ నగర్ డివిజన్‌లోని అంబిర్ చెరువులో వేసిన జియో సెల్ టవర్ పై దిశ సమగ్ర వార్తా కథనాన్ని ప్రచురించింది. దీనిపై బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, వెలగ శ్రీనివాస్ ఇతర బీజేపీ నాయకులు నిజనిర్దారణ చేశారు. అలాగే సెల్ టవర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.

దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన జియో సంస్థ ప్రతినిధులు అంబిర్ చెరువులో వేసిన సెల్ టవర్‌ను క్రేన్ సహాయంతో తొలగించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న దిశ దినపత్రిక కృషిని పలువురు ప్రశంసించారు.

Tags:    

Similar News