భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 8% వృద్ధి చెందుతుంది: IMF అధికారి

గత 10 ఏళ్లలో భారత్ అమలు చేసిన విధానాలను రెట్టింపు చేసి, సంస్కరణలను వేగవంతం చేసినట్లయితే 2047

Update: 2024-03-28 08:46 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: గత 10 ఏళ్లలో భారత్ అమలు చేసిన విధానాలను రెట్టింపు చేసి, సంస్కరణలను వేగవంతం చేసినట్లయితే 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ అన్నారు. ఇంతకుముందు భారత్ 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందలేదు, కానీ దీనిని సాధించవచ్చు. 2023 చివరి మూడు నెలల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే మెరుగైన 8.4 శాతం వృద్ధిని సాధించింది, ఇది గత ఒకటిన్నర సంవత్సరాల్లో అత్యంత వేగంగా నమోదు అయింది. అక్టోబరు-డిసెంబర్‌లో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను 7.6 శాతానికి తీసుకువెళ్లింది. భారత్ 8 శాతం వృద్ధిని సాధిస్తే 2047 నాటికి 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని సుబ్రమణియన్ అన్నారు.

1991 నుండి, భారతదేశ సగటు వృద్ధి 7 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పన కోసం తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. భూమి, కార్మిక, మూలధనం, లాజిస్టిక్స్, తయారీ రంగంలో సంస్కరణలు అవసరమని, దేశ జీడీపీలో 58 శాతం దేశీయ వినియోగం నుండి వస్తున్నందున దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సుబ్రమణియన్ పేర్కొన్నారు.

Similar News