తీవ్ర ఒడిదుడుకుల మధ్య మళ్లీ నష్టాల్లో సూచీలు

లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు

Update: 2024-05-08 12:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతకుముందు సెషన్‌లో నష్టాలను చూసిన సూచీలు బుధవారం ట్రేడింగ్‌లోనూ రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ప్రధానంగా దేశంలోని లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, దీనికితోడు కీలక ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు, విదేశీ ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకోవడం, ఇతర బలహీన ధోరణుల కారణంగా నీరసించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 45.46 పాయింట్లు నష్టపోయి 73,466 వద్ద, నిఫ్టీ మంగళవారం సెషన్‌లో ముగిసిన స్థాయిలు 22,302 పాయింట్ల వద్దే ముగిశాయి. నిఫ్టీలో మెటల్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ, మారుతీ సుజుకి, నెస్లె ఇండియా, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఏషియన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.51 వద్ద ఉంది. 

Tags:    

Similar News