మళ్లీ గ్యాస్ బండ బాదుడు.. ఎంతంటే!

న్యూఢిల్లీ: కేంద్రం మరోసారి సామాన్యులపై గుది బండ మోపింది. గురువారం మరోసారి వంట గ్యాస్ ధరలను పెంచింది..Latest Telugu News

Update: 2022-05-19 13:41 GMT

న్యూఢిల్లీ: కేంద్రం మరోసారి సామాన్యులపై గుది బండ మోపింది. గురువారం మరోసారి వంట గ్యాస్ ధరలను పెంచింది. గృహ వినియోగ సిలిండర్లపై రూ.3.50 పెంచుతున్నట్లు తెలిపింది. తాజా పెంపుతో దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల ధర దేశ రాజధానిలో రూ.1000 దాటింది. తాజా ధరల ప్రకారం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ఢిల్లీలో రూ.1003 కు, కోల్ కతాలో రూ.1029, చెన్నైలో రూ.1018.5కు చేరాయి. కాగా, ఈ నెలలో గ్యాస్ ధరలు రెండో సారి పెంచడం గమనార్హం. ఈ నెల 7న రూ.50 పెంచిన సంగతి తెలిసిందే.

Similar News