మనోహర్ పంతులు జీవితం ఆదర్శనీయం : ప్రియదర్శిని

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సాతంత్ర్య సమర యోధుడు వేమవరం మనోహర్ పంతులు గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా, ప్రముఖులు సందర్శించి, నివాళులర్పిస్తున్నారు. తాజాగా.. బహుజన సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మేడి ప్రియదర్శిని మనోహర్ పంతులు పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి […]

Update: 2021-10-22 04:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సాతంత్ర్య సమర యోధుడు వేమవరం మనోహర్ పంతులు గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా, ప్రముఖులు సందర్శించి, నివాళులర్పిస్తున్నారు.

తాజాగా.. బహుజన సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మేడి ప్రియదర్శిని మనోహర్ పంతులు పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడు మనోహర్ పంతులు జీవితం అందరికీ ఆదర్శం అని అన్నారు. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News