బొలెరో బోల్తా.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు

దిశ ‌ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం రాంపురం వద్ద బోలెరో వాహ‌నం అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. మ‌రో 12 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. వివరాళ్లోకి వెళితే.. చంద్రుగొండ మండ‌లానికి చెందిన వీరంతా.. మ‌హ‌బూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాలో జరుగుతున్న శుభకార్యానికి బోలెరో వాహ‌నంలో బ‌య‌ల్దేరారు. ఈ క్ర‌మంలో రాంపురం గ్రామానికి చేరుకోగానే ఎదురుగా వ‌స్తున్న టాటాఎస్ వాహ‌నాన్ని త‌ప్పించ‌బోయి రోడ్డు వంపులోకి దూసుకెళ్ల‌ి బోల్తాప‌డింది. ఈ […]

Update: 2020-08-04 09:11 GMT

దిశ ‌ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం రాంపురం వద్ద బోలెరో వాహ‌నం అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. మ‌రో 12 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. వివరాళ్లోకి వెళితే.. చంద్రుగొండ మండ‌లానికి చెందిన వీరంతా.. మ‌హ‌బూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాలో జరుగుతున్న శుభకార్యానికి బోలెరో వాహ‌నంలో బ‌య‌ల్దేరారు.

ఈ క్ర‌మంలో రాంపురం గ్రామానికి చేరుకోగానే ఎదురుగా వ‌స్తున్న టాటాఎస్ వాహ‌నాన్ని త‌ప్పించ‌బోయి రోడ్డు వంపులోకి దూసుకెళ్ల‌ి బోల్తాప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ల‌క్ష్మీ(40) అనే మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంద‌ని సమాచారం. క్ష‌త‌గాత్రుల‌ను ఖ‌మ్మంలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Tags:    

Similar News