ఆందోళనలో ఉద్యోగులు.. KCR తుగ్లక్ పాలనకు ఇదే నిదర్శనం : బండి సంజయ్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడిందని, స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఇది ముఖ్యమంత్రి తుగ్లక్ పాలనకు నిదర్శనమని సోమవారం ఓ సమావేశంలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తీసుకొస్తూ రాజకీయ లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని ఫైరయ్యారు. ఇప్పటికే ప్రమోషన్లు […]

Update: 2021-12-13 00:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడిందని, స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఇది ముఖ్యమంత్రి తుగ్లక్ పాలనకు నిదర్శనమని సోమవారం ఓ సమావేశంలో మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తీసుకొస్తూ రాజకీయ లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని ఫైరయ్యారు. ఇప్పటికే ప్రమోషన్లు దక్కక, ఇతరత్రా సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులను మరింత ఇబ్బంది పెట్టేలా సీఎం వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పాత సమస్యను దారిమళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరమీదకు తెస్తూ రాజకీయ పబ్బం గడపుకోవడం సీఎంకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలను కమీషన్లుగా దండుకున్న సీఎం ఆ డబ్బుతోపాటు ఉద్యోగుల సమస్యలనూ దాచిపెడుతూ.. తనకు అవసరమైనప్పుడు మాత్రమే వాటిని బయటకు తీస్తూ రాజకీయ డ్రామాలాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న ఈ జీవో అమలును తక్షణమే నిలిపివేయాలని బండి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న తరువాతే జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరపాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని దెబ్బతీయకుండా నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News