కరోనాపై పిల్లలకు అవగాహన పెరిగింది- గవర్నర్ తమిళి సై

దిశ, ఖైరతాబాద్ : కరోన జాగ్రత్తలపై పిల్లలకు అవగాహన పెరిగిందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు ప్రారంభం కావడంతో రాజ్ భవన్ నుంచి ప్రభుత్వ పాఠశాలను ఆమె పరిశీలించారు. చాలాకాలం తర్వాత పాఠశాలకు రావడం ఎలా ఉందంటూ విద్యార్థులను ప్రశ్నించడంతో చాలా సంతోషంగా ఉందని సమాధానం చెప్పారు.‌ కరోనా కారణంగా సుమారు ఏడాదిన్నర తరువాత పాఠశాలలు పునః ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గతంతో పోల్చితే […]

Update: 2021-09-01 11:05 GMT

దిశ, ఖైరతాబాద్ : కరోన జాగ్రత్తలపై పిల్లలకు అవగాహన పెరిగిందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు ప్రారంభం కావడంతో రాజ్ భవన్ నుంచి ప్రభుత్వ పాఠశాలను ఆమె పరిశీలించారు. చాలాకాలం తర్వాత పాఠశాలకు రావడం ఎలా ఉందంటూ విద్యార్థులను ప్రశ్నించడంతో చాలా సంతోషంగా ఉందని సమాధానం చెప్పారు.‌ కరోనా కారణంగా సుమారు ఏడాదిన్నర తరువాత పాఠశాలలు పునః ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గతంతో పోల్చితే పిల్లలకు కరోనా వ్యాధిని నియంత్రించే అంశాలపై అవగాహన పెరగడంతో మాస్కులు ధరించడం శానిటేషన్‌లను వాడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు మాస్కులు శానిటైజర్ లు అందజేశారు.

Tags:    

Similar News