మానకొండూరు‌లో మరో ప్రమాదం.. 15 మందికి గాయాలు

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామం వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు నుండి వస్తున్న లారీ వేగంగా ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 15 మందికి గాయాలు కాగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో ఉన్న వారంతా జయశంకర్ భూపాలపల్లికి చెందిన వారిగా […]

Update: 2021-12-04 12:22 GMT

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామం వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు నుండి వస్తున్న లారీ వేగంగా ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 15 మందికి గాయాలు కాగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో ఉన్న వారంతా జయశంకర్ భూపాలపల్లికి చెందిన వారిగా గుర్తించారు. వేములవాడ దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News