Ycp Mla Elijah: రాజకీయాల నుంచి తప్పుకుంటా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రం’కి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.

Update: 2022-12-02 15:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రం'కి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా గురువారం చింతలపూడిలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎలిజాపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆరోపణలపై చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా స్పందించారు. తన పై చంద్రబాబు నిరాదరణమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

చింతలపూడిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండెకరాల భూమి ఉన్న చంద్రబాబు, రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారు అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేసేదానికన్నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణకు సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని అయితే చంద్రబాబు మీద ఉన్న 18 కేసులలో స్టేలను ఎత్తివేసి కేసులు ఎంక్వయిరీకి సిద్ధమేనా అని సవాల్ చేశారు. తనపై నేరారోపణ రుజువైతే శాశ్వతంగా రాజకీయాలనుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు. భూకబ్జాదారుడైన చింతమనేని ప్రభాకర్‌ను పక్కనే పెట్టుకుని తనన కబ్జాదారుడు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పట్టాయిగూడెంలో చింతమనేని ప్రభాకర్ 120 ఎకరాలు భూమిని ఆక్రమించుకోవడం వాస్తవం కాదా అని నిలదీశారు. దళితుడునైన తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి రాజకీయాలు చేయాలనుకోవటం..మీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎలిజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News