AP Politics:సైకిల్‌కి ఓటేసి అరాచకాన్ని పారద్రోలండి: టీడీపీ అభ్యర్థి

రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అరాచకానికి ముగింపు పలకాలని బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీ నాయన పిలుపు నిచ్చారు.

Update: 2024-04-24 15:20 GMT

దిశ ప్రతినిధి,విజయనగరం: రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అరాచకానికి ముగింపు పలకాలని బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీ నాయన పిలుపు నిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రామభద్రపురం మండలం నాయుడు వలస దుప్పలపూడి గ్రామంలో ఆయన గడప గడపకి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తిగా అందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ ,విజయనగరం పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు మడక తిరుపతిరావు , విజయనగరం పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు కర్రోతు తిరుపతి రావు ,మండల పార్టీ అధ్యక్షులు కరణం విజయభాస్కర రావు , బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి లతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయుడు వలస గ్రామం నుండి మడక సింహాచలం ,లచ్చాపాత్రుడు అప్పన్న ,గంట చిన్నంనాయుడు గ,మాజీ ఎంపీటీసీ శ్రీమతి మడక హైమావతి , దుప్పలపూడి గ్రామం నుండి సీర వేణు ,సీర ఈశ్వరరావు ,కండి పల్లి సత్యనారాయణ ,వైకుంఠం తిరుపతిరావు పాల్గొన్నారు.

Similar News