Vizianagaram: భర్త హత్య కేసులో సంచలన తీర్పు

విజయనగరం జిల్లా తుమ్మికాపల్లిలో జరిగిన హత్య కేసులో నిందితురాలికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ విజయనగరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది....

Update: 2023-06-27 13:36 GMT

దిశ, కొత్తవలస: విజయనగరం జిల్లా తుమ్మికాపల్లిలో జరిగిన హత్య కేసులో నిందితురాలికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది. కొత్తవలస మండలం, తుమ్మికాపల్లికి చెందిన గృహిణి.. తనను అనుమానించి, మానసికంగా వేధిస్తున్నాడని భర్తను హత్య చేసింది. దీంతో కొత్తవలస పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అనంతరం కోర్టులో అభియోగ పత్రాలను పోలీసులు దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితురాలిపై నేరారోపణలు రుజువు అయ్యాయి. దీంతో నిందితురాలికి విజయనగరం డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి జీవిత ఖైదు, వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.

Tags:    

Similar News