జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు:బీజేపీ నేత

పశ్చిమ నియోజకవర్గం లోని బీజేపీ ఆఫీస్ లో టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు.

Update: 2024-04-01 09:10 GMT

దిశ ప్రతినిధి,విజయవాడ:పశ్చిమ నియోజకవర్గం లోని బీజేపీ ఆఫీస్ లో టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి కావడం వలన ఇక్కడ ఉన్న సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అన్నారు.వైస్సార్సీపీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని,పెత్తందారులు సామాన్యులపై పోటీ చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని అన్నారు.ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటే పెత్తందారులు ఎవరు ఉండరని ఆయన అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని ఆయన ఆరోపించారు.రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.సిద్ధం..సిద్ధం.. అంటున్నారు జగన్ ప్రభుత్వాన్ని దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.లోకల్, నాన్ లోకల్ అని మాట్లాడుతున్నారు. గతంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎంతో మందిని ఆహ్వానించారని అన్నారు. కొంతమంది అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమని, పొత్తులో అందరికీ అవకాశాలు రాకపోవచ్చునాని అన్నారు.నియోజకవర్గం లో సుజనా చౌదరిని బీజేపీ,జనసేన, టీడీపీ పార్టీ లు కలిసి మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు ఎం.విజయలక్ష్మి,టి.డి.పి నాయకులు యడుపాటి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Similar News