రాష్ట్రాన్ని దోచుకుంది అయ్యన్న, చంద్రబాబులే: ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్

రాష్ట్రాన్ని దోచుకుంది అయ్యన్న, చంద్రబాబులేనని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శించారు..

Update: 2023-04-14 11:14 GMT

దిశ, నర్సీపట్నం: రాష్ట్రాన్ని దోచుకుంది అయ్యన్న, చంద్రబాబులేనని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. అమలాపురంలో ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు చేసిన విమర్శలపై స్పందించారు. అనాడు 2014-2019 వరకు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగలు చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు అన్నారు. మళ్లీ వీరు గ్రామాలకు రావడంతో ప్రజలు ఇదేం కర్మ అని అనుకుంటున్నారన్నారు. టీడీపీ హయాంలో ఇసుక దోపిడీ, నీరు చెట్టు పథకంలో దోపిడీ గురించి చెప్పాలన్నారు. 2014లో 600 హామీలు ఇచ్చి 60 హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అర్హులందరికి సంక్షేమపథకాలు అందజేస్తున్నామన్నారు. ఏదో విధంగా తమ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఏ గ్రామంలో అయితే అయ్యన్నపాత్రుడు సమావేశాలు పెట్టి విమర్శలు చేస్తారో వెంటనే పార్టీ నాయకులు కూడా అదే రీతిలో రెట్టింపు ప్రతివిమర్శలతో తిప్పికొట్టాలన్నారు.

Also Read..

సీఎం జగన్‌కు థ్యాంక్స్: Mla Kotam Reddy 

Tags:    

Similar News