Visakha: ఒక్క ఛాన్స్‌తో దగా.. సీఎం జగన్‌పై తెలుగు తమ్ముళ్ల ఫైర్

మహానాడుకి తరలి రావాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు...

Update: 2023-05-26 17:11 GMT

దిశ, ఉత్తరాంధ్ర: మహానాడుకి తరలి రావాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో పల్లా మాట్లాడుతూ 27, 28న మహానాడు రాజమండ్రిలో జరపబోతున్నామని, టీడీపీ శ్రేణులు భారీగా తరలి రావాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నభుతొ నభవిష్యత్తుగా జరుపుకునే విధంగా వేడుక జరుపుకుంటున్నామని చెప్పారు. తెలుగు వారి గొప్పదనం గుర్తింపు తెచ్చిన అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందన్నారు. ఒక నియంత పరిపాలన కొనసాగుతుందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాబోయే ది స్వేచ్ఛా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రజల కోసం కొత్త రాజకీయాన్ని తెచ్చారని, నేడు జగన్ తండ్రి అధికారం అడ్డు పెట్టుకొని ఒక్క చాన్స్ అంటూ ప్రజలను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎవరి సొత్తు కాదని, తెలుగు వారి ఆత్మాభిమానమన్నారు. రాజమండ్రి మహానాడులో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం నియమ నిబంధనలు లేకుండా రాక్షసత్వంగా వ్యవహరిస్తుందనన్నారు. వ్యవస్థలు అంటే లెక్కే లేదని, ఈ వ్యవస్థలపై భక్తిని భయాన్ని పోగొట్టిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. పోలీసులు వైసీపీ వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పాశర్ల ప్రసాద్ ఆరోపించారు.

Tags:    

Similar News