Tejaswini Nandamuri: బీచ్‌లో వాలీబాల్ ఆడిన బాలయ్య చిన్న కూతురు.. ఫోటోలు వైరల్..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దలు ప్రచార సమయంలో చేయని పనంటూ వుండదు.

Update: 2024-05-05 10:24 GMT

దిశ ప్రతినిది, విశాఖపట్నం: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దలు ప్రచార సమయంలో చేయని పనంటూ వుండదు. ఏ వర్గం ప్రజల వద్దకు వెళ్తే ఆ పని చేయాల్సిందే. రాకున్నా చేసినట్లు ఫోటో దిగాల్సిందే. విశాఖలో పోటీ చేసే అభ్యర్దులకు అయితే ఆర్‌కే బీచ్‌లో వాక్ చూస్తూ.. ఓట్లు అడగడం అలవాటైపోయంది. ప్రతిరోజూ వేల మంది బీచ్ రోడ్‌లో వాకింగ్‌కు రావడమే అందుకు కారణం.

అందులో సెలవు దినాలు, ఆదివారాలైతే వచ్చేవారి సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఇది గమనించే విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ది , గీతం విద్యాసంస్దల అధినేత ఎం.శ్రీభరత్ ఆదివారం బీచ్ వాక్‌కు వచ్చి పనిలో పనిగా ఓట్లు అడిగేశారు. తనతో పాటు భార్య తేజస్వినీని వెంటపెట్టుకువచ్చి సరదాగా కాసేపు అక్కడి కుర్రాళ్లతో కలసి వాలీ బాల్ కూడా అడారు.

 

వాలీబాల్‌లో బార్య భర్తలిద్దరికీ ప్రావీణ్యం వుండడంతో చక్కటి సర్వీసులతో ఆకట్టుకొన్నారు. తెలుగుదేశం విశాఖ అధ్యక్షుడు గండి బాబ్జీ, బీజేపీ నేత ప్రధ్వీరాజ్ తదితరులు వీరితోపాటుగా బీచ్ వాక్ ప్రచారంలో పాల్గొన్నారు.

Similar News