Ap News: వృద్ధులకు, దివ్యాంగులకు చేదోడుగా విశాఖ పోలీసులు

విశాఖ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ..

Update: 2023-03-13 12:32 GMT

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓటర్లకు పోలీసులు విశేష సేవలందించారు. ఎన్నికల విధులను పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బంది పడుతున్న వృద్ధులు, దివ్యాంగులకు సహాయం చేశారు. అనారోగ్యంతో నడవలేని వారి పట్ల మానవత్వంతో వ్యవహరించి తమలోని సేవా గుణాన్ని చాటారు. నడవలేని స్థితిలో ఉన్న వారిని, వీల్ చైర్‌లో వచ్చిన ఓటర్లను తమ స్వహస్తాలతో మోసుకెళ్తు ఓట్ హక్కును వినియోగించుకునేలా పోలీసులు సహకరించారు.

Tags:    

Similar News