vishaka: మహిళ దారుణ హత్య..డ్రమ్ములో మృతదేహం
విశాఖ మధురవాడలో దారుణం జరిగింది. మహిళను దుండగులు అత్యంత దారుణంగా చంపారు. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి పడేశారు. ...
దిశ వెబ్ డెస్క్: విశాఖ మధురవాడలో దారుణం జరిగింది. మహిళను దుండగులు అత్యంత దారుణంగా చంపారు. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి పడేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. మృతురాలి వివరాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనతో మధురవాడలో ఒక్కసారిగా కలకలం రేగింది.