Nimmalapalem: యదేచ్ఛగా అధికార దుర్వినియోగం.. అక్రమంగా చెరువు మట్టి తవ్వకాలు

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నిమ్మలపాలెం చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి....

Update: 2023-03-19 13:20 GMT

దిశ, కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నిమ్మలపాలెం చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నిమ్మలపాలెం సర్పంచ్ కొట్యాడ శ్రీను తన వ్యక్తిగత అవసరాల కోసం జేసీబీ, ట్రాక్టర్లు పెట్టి అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఇదే విషయమై సదరు సర్పంచ్‌ను వివరణ అడగగా తన వ్యక్తిగత అవసరాల కోసం గ్రావెల్ తవ్వుతున్నానని.. ఇందుకు రెవెన్యూ అధికారులు అనుమతి ఉందని చెబుతున్నారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం సర్పంచ్‌కు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అనుమతులు తమ పరిధిలోనివి కాదని ఇరిగేషన్ శాఖ, మైనింగ్ శాఖ పరిధిలోకి వస్తాయని చెప్పారు. గ్రావెల్ తరలింపుపై గ్రామ రెవెన్యూ అధికారితో విచారణ చేస్తామన్నారు. అక్రమాలను అరికట్టాల్సిన ప్రజా ప్రతినిథే ఇటువంటి చర్యలకు పూనుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News