AP Politics: వైసీపీకి మరో బిగ్ షాక్.. టీపీలోకి ప్రముఖ సీనియర్ నేతలు

గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ముద్రపడి వైసీపీ ఆవిర్భం నుండి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినప్పటికీ పార్టీ..

Update: 2024-05-01 07:04 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ముద్రపడి వైసీపీ ఆవిర్భం నుండి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినప్పటికీ పార్టీ నిర్లక్ష్య ధోరణికి మనస్థాపానికి గురైన సీనియర్ నాయకులు పి.ఐ.బాలరాజు ఎట్టకేలకు టీడీపీ గూటికి చేరారు. పి.ఐ.బాలరాజుకు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

ఇక బాలరాజు బాటలో మరో మహిళా నాయకురాలు సింహాచలం మాజీ బోర్డు డైరెక్టర్ సువడా శ్రీదేవి ఒకప్పటి ఒకటో వార్డు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత వైసీపీ సీనియర్ నాయకులు భోద రాము, సీనియర్ యువ నాయకులు గేదెల ఆనంద్, సిహెచ్ సన్యాసిరావు, సీనియర్ మహిళా నేత బుగత కనక దుర్గ, కే మహేష్, ఎం బాబురావు, ఎండి సోను తోపాటుగా సుమారు వంద మంది కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అయ్యారు .


Similar News