Visakha: మా పాలనలో అలాంటివి జరిగాయా?: మంత్రి బొత్స

ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు...

Update: 2023-08-19 10:58 GMT

దిశ, వెబ్ డెస్క్:  ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకుంది ఎవరని ఆయన ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందే చంద్రబాబు అని విమర్శించారు. ఏపీలో చంద్రబాబుకు సొంత ఇల్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో రైతులు ఆత్మహత్యలు జరిగాయని గుర్తు చేశారు. సీఎం జగన్ పాలనలో రైతు ఆత్మహత్యలు ఎక్కడైనా ఉన్నాయా అని నిలదీశారు. సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామని తెలిపారు. ఒకటో తేదీనే వృద్ధ్యాప్య పింఛను ఇంటి వద్దకే వెళ్లే ఇస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో జనాలను పీడించారని ఆరోపించారు. అందుకే 2019 ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఇంటికి పంపారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. 

Tags:    

Similar News