Ap Bjpలో విషాదం.. సీనియర్ నాయకురాలు కన్నుమూత
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలు పొగతోట రమాకుమారి కన్నుమూశారు. దీంతో ఏపీ బీజేపీలో విషాదం నెలకొన్నట్లైంది..
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలు పొగతోట రమాకుమారి కన్నుమూశారు. దీంతో ఏపీ బీజేపీలో విషాదం నెలకొన్నట్లైంది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. రమాకుమారి మరణం పార్టీకి వ్యక్తిగతంగా తమ అందరికీ తీరని లోటని అన్నారు. పార్టీలో ఆమె చాలా యాక్టివ్గా ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి రమాకుమారి అలుపెరగని కృషి చేశారన్నారు. అలాంటి రమా కుమారి మరణించారంటే నమ్మలేని పరిస్థితి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు