విశాఖకు చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ నౌక..!

ది వరల్డ్ అనే అంతర్జాతీయ క్రూయిజ్ షిప్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మనల్‌కు ఆదివారం వచ్చింది.

Update: 2024-04-28 15:15 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: ది వరల్డ్ అనే అంతర్జాతీయ క్రూయిజ్ షిప్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మనల్‌కు ఆదివారం వచ్చింది. విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రిస్ టెర్మినల్కు అంతర్జాతీయ ప్రయాణీకులకు నౌక రావడం ఇదే ప్రథమం. దీంతో విశాఖ పోర్టు అధికారులు ఈ షిప్పుకు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దాదాపు 80 మంది ప్రయాణికులతో ఈ షిప్ విశాఖపట్నం పోర్టుకు వచ్చింది. ఈరోజు షిప్ లోని పర్యాటకులు విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను తిలకించనున్నారు. ఆది,సోమ వారాల్లో విశాఖపట్నంలోనే ఉంటుంది. సోమవారం రాత్రికి విశాఖపట్నం నుంచి ఈ షిప్ బయలుదేరి వెళుతుంది.

Similar News