BREAKING: చంద్రబాబు ఫేక్ వీడియో వైరల్.. వైసీపీపై ఎన్నికల కమిషన్‌కు దేవినేని ఉమ ఫిర్యాదు

ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏఎన్ఐకి ఇంటర్య్వూ ఇచ్చారు.

Update: 2024-05-12 16:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏఎన్ఐకి ఇంటర్య్వూ ఇచ్చారు. అయితే, ఆ వీడియోను వైసీపీ ఫేక్ వీడియోగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆ వీడియోలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లు ఫేక్ వీడియోను రూపొందించారు. అదే వీడియోను వైసీపీ తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో స్పందించిన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఇవాళ సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి వైసీపీపై ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News