Viral News: శ్రీవారి సుప్రభాత సేవలో రామ్ చరణ్ దంపతులు

మెగాస్టార్ హీరో చిరంజీవి తనయుడు స్టార్ హీరో రామ్ చరణ్ సతీ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

Update: 2024-03-27 03:40 GMT

దిశ తిరుమల: మెగాస్టార్ హీరో చిరంజీవి తనయుడు స్టార్ హీరో రామ్ చరణ్ సతీ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన రామ్ చరణ్ ఉపాసన దంపతులు కుటుంబ సమేతంగా సుప్రభాత సేవలో పాల్గొని,స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

 

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రామ్ చరణ్ ఉపాసన దంపతులను ఆశీర్వదించిన ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆ తరువాత రామ్ చరణ్ దంపతులు ఆలయం వెలుపలికి రాగా వారితో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో అభిమానుల తాకిడి నుంచి తప్పించుకునేందుకు రామ్ చరణ్, ఉపాసన  బ్యాటరీ వాహనంలో కొద్ది దూరం ప్రయాణించారు. అయినప్పటికీ అభిమానులు రామ్ చరణ్ తో కలిసి ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.

 

 

Tags:    

Similar News