చీరాలలో రైలు కింద పడి మహిళా వీఆర్వో ఆత్మహత్య
ఏకష్టమెుచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ మహిళా వీఆర్వో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది...Woman Commits Suicide In Chirala
దిశ, డైనమిక్ బ్యూరో: ఏకష్టమెుచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ మహిళా వీఆర్వో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా కారంచేడు మండలం చీరాల ఆర్ఓబీ వద్ద శుక్రవారం జరిగింది. కుంకలమర్రు గ్రామానికి చెందిన సీహెచ్ నాగమణి.. పర్చూరు మండలం గొల్లపూడిలో వీఆర్వోగా పనిచేస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఆమె ఆర్ఓబీ వద్ద ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఒంగోలువైపు వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే రైల్వే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వీఆర్వో ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? కుటుంబ సమస్యలా? లేక పని ఒత్తిడి కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.