AP Politics: అయితే మాకేంటి కనీసం ఓదార్పు ఇచ్చారా?

పార్టీ అంటే కార్యకర్తలకు అండగా ఉండేదని పార్టీ కోసం రక్తం ఓడితే కనీసం ఓదార్పు ఇవ్వడం..

Update: 2024-04-27 10:55 GMT

దిశ కొండపి: పార్టీ అంటే కార్యకర్తలకు అండగా ఉండేదని పార్టీ కోసం రక్తం ఓడితే కనీసం ఓదార్పు ఇవ్వడం నైతిక బాధ్యత అని కానే కొండపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అలాంటి ఆలోచన లేదని కొండపి నియోజకవర్గం నారసింహ నాయని కండ్రిక ( ఎన్‌ఎన్ కండ్రిక ) తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు.

2023జూలై 18 నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా తెలుగు దేశంలో రెండో వర్గం తెలుగు తమ్ముళ్ళను దారి కాచి తలలు పగల గొట్టారని దాడికి గురై 9 నెలలు గడుస్తున్నా కనీసం ఓదార్పు ఇవ్వలేదని తమ్ముళ్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా ఎన్ ఎన్ కండ్రిక తెలుగు తమ్ముళ్లు న్యాయం కావాలి అంటూ వేసిన పోస్టర్‌లు రాజకీయ వర్గాలలో చర్చనియాంశం అయింది. తెలుగు దేశం నాయకత్వం వీరి గోడు విని ఏవిధంగా ఓదారుస్తారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Similar News