ఈసారి నాకు టికెట్ ఇవ్వరేమో.. Ongole Mla Balineni ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వరేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ..

Update: 2023-01-23 12:06 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వరేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తన భార్యకు టికెట్ ఇస్తే చేసేదేంలేదని ఆయన వ్యాఖ్యానించారు. కొండపి వైసీపీ ఇంచార్జి అశోక్ బాబుపై కొందరు అసంతృలో ఉన్నారని.. సమన్వయంతో పని చేయాలని బాలినేని సూచించారు. పార్టీ కార్యకర్తల కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం  చర్చనీయాంశంగా మారాయి.

కాగా ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసరావు సీఎం జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. రెండోసారి కేబినెట్‌లో ఆయనకు సీటు దక్కలేదు. బాలినేని వ్యతిరేకించిన మరో మంత్రిని కొనసాగించడంపై అప్పట్లో ఆయన సీఎం జగన్‌పై గుర్రుగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సద్దుమనిగారు.

ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు వర్సెస్ టీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిగా రాజకీయం కొనసాగుతోంది. ఇరు నాయకుల వర్గీయుల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవలే ఒంగోలులో ఫ్లెక్సీ రగడ రగిలింది. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి.. తన టికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి స్వయానా సీఎం జగన్ బంధువులు కావడం విశేషం.

Similar News