Ap News: కొర్రపాడు చెక్ పోస్టు వద్దకు కారు.. డిక్కీ లేపి చూస్తే కళ్లు చెదిరే..!

రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ...

Update: 2024-03-28 17:00 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల అధికారులు డబ్బుల తరలింపుపై గట్టి నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. డబ్బు, మద్యం, బంగారం, వెండి, చీరలు, గిఫ్టుల తరలింపుపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడు చెక్ పోస్టు వద్ద పోలీసులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న 9.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లికి చెందిన రామచంద్రరావు కారులో నగదు తరలిస్తుండగా గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఐటీ శాఖ అధికారులను అప్పగించనున్నారు. 

Similar News