ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..నారా లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్!

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీఎం జగన్‌పై రాయితో దాడిలో ఎడమ కనుబొమ్మపై గాయమైన విషయం తెలిసిందే.

Update: 2024-04-27 11:19 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీఎం జగన్‌పై రాయితో దాడిలో ఎడమ కనుబొమ్మపై గాయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం జగన్ ఎట్టకేలకు బ్యాండేజ్ తీశారు. తన నుదిటిపై బ్యాండేజ్ తీయడం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనను కోడి కత్తి డ్రామా 2 అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఇంకెన్ని రోజులు ఈ బ్యాండేజ్ పాలిటిక్స్ అంటూ మీమ్స్ వైరల్ అయ్యాయి.

గాయం తగ్గకానే బ్యాండేజ్ తీయలేదా? లేదంటే సానుభూతి కోసమే బ్యాండేజ్ డ్రామా కొనసాగుతుందా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వచ్చాయి . ఈ విషయం వైసీపీ పెద్దల దృష్టికి చేరిందేమో కానీ, వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా జగన్ బ్యాండేజ్ లేకుండా కనిపించడంతో ప్రజల ట్రోలింగ్ దెబ్బకు జగన్ కట్టును తీసేశారని సెటైర్లు వేస్తున్నారు. ఇదే విషయమై నారా లోకేష్ తాజాగా స్పందించారు. బ్యాండేజ్ మాయం.. జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అంటూ ఎద్దేవా చేశారు. దీనికి సీఎం జగన్ నుదుటిపై గాయం లేదని చూపిస్తూ ఆయన ఫొటోలను జతచేశారు.

Click Here for Nara Lokesh ట్వీట్



Tags:    

Similar News