Kurnool: 105 కిలోల వెండి మాయం.. ముగ్గురు పోలీసుల సస్పెండ్

కర్నూలు అర్బన్ పీఎస్లో వెండి మాయం అయింది. ఈ కేసులో పోలీస్ అధికారులపై వేటు పడింది...

Update: 2023-04-16 14:03 GMT

దిశ, కర్నూలు :  కర్నూలు అర్బన్ పీఎస్లో వెండి మాయం అయింది. ఈ కేసులో పోలీస్ అధికారులపై వేటు పడింది. సీఐ విక్రమసింహ, ఎస్ఐ లక్ష్మీనారాయణ, ఏఎస్ఐ భాస్కర్రాజును సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎస్పీ జి.కృష్ణకాంత్ సస్పెండ్ చేశారు. కర్నూలు తాలూకా పీఎస్లో 105 కిలోల వెండి మాయమైన కేసులో ఇప్పటికే ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు అరెస్ట్‌ అయ్యారు. అలాగే వారిని సస్పెండ్ కూడా చేశారు. పోలీసులు గానీ, పోలీసు అధికారులు గానీ విధుల్లో అలసత్వం వహిస్తే వేటు తప్పదని ఎస్పీ హెచ్చరించారు.

Tags:    

Similar News