ఆ బాధ్యత ప్రభుత్వానిదే: Bopparaju Venkateshwarlu

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఏపీజేఏసీ రాష్ట్ర కార్యవర్గం నేతలు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారపై ప్రభుత్వం స్పష్టం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు..

Update: 2023-02-05 16:46 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఏపీజేఏసీ రాష్ట్ర కార్యవర్గం నేతలు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారపై ప్రభుత్వం స్పష్టం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమ సమస్యలు పరిష్కారానికి షెడ్యూల్ ప్రకటించాలన్నారు.ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కర్నూలులో మహాసభను నిర్వహించారు. ఈ సందర్బంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై సీఎస్‌కు 3 రోజుల్లో లేఖ ఇస్తామన్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యోగ సంఘాలతో సంప్రదించి ఫిబ్రవరి 26న రాష్ట్ర కార్యవర్గంలో ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. ఉద్యోగుల ఆవేదనను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తామని ఉద్యోగులకు బొప్పరాజు హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News