Pawan Kalyan: రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ పర్యటన.. కార్యకర్త కుటుంబానికి పరామర్శ
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలకు చేసుకున్న - Janasena party leader Pawan Kalyan tour in Nalgonda district telangana
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలకు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆర్థిక సహాయం చేసేందుకు ఇటీవల పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణలో కూడా పర్యటించనున్నట్లు ఆ పార్టీ ట్విట్టర్ వేదిక వెల్లడించింది.ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20 వ తేదిన శుక్రవారం పర్యటించనున్నారు. నల్గొండలో జనసేన పార్టీ కోసం పనిచేసిన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలను పరమర్మించడానికి వస్తున్నట్లుగా నల్గొండ జిల్లా ఇన్చార్జి మేకల సతీష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళుతూ.. మధ్యలో పవన్ కళ్యాణ్ చౌటుప్పల్లో ఆగుతారని, ఆపై కోదాడకు వెళ్తారని జనసేన పార్టీ వెల్లడించింది. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. మెట్టుగూడ, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్లోని లక్కారం గ్రామంలో వెళ్లనున్నారు. కొంగర సైదులు కుటుంబాన్ని పవన్ పరామర్శించనున్నారు. ఆ తర్వాత కోదాడ వెలుతారు. పవన్ అక్కడ కడియం శ్రీనివాస్ రావు కుటుంబాన్ని పరామర్శిస్తారు.
20న శ్రీ @PawanKalyan గారు ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన pic.twitter.com/uERNoQwPmK
— JanaSena Party (@JanaSenaParty) May 19, 2022
ఈ నెల 20వ తేదీన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి నల్గొండ జిల్లా పర్యటన.
— JanaSena Party (@JanaSenaParty) May 19, 2022
ప్రమాదవశాత్తు మృతిచెందిన చౌటుప్పల్, హుజూర్ నగర్ కు చెందిన జనసైనికులు కొంగరి సైదులు, కడియం శ్రీనివాసరావు గారి కుటుంబాలను పరామర్శించి 5 లక్షల రూపాయల భీమా చెక్కు అందజేయనున్నారు.#JanaSenaTelangana pic.twitter.com/DawsPdMSY4