Palnadu జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో యువతిపై దాడి

పల్నాడు జిల్లాలో యువతి మిస్సింగ్ మిస్టరీని పోలీసుల ఛేదించారు. ప్రేమించిన యువతిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి యువకుడు దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. ..

Update: 2022-12-04 15:25 GMT

దిశ వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో యువతి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రేమించిన యువతిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి యువకుడు దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. అయితే అప్పటి నుంచి ఆ యువతి కనిపించకుండా పోయింది. దీంతో తన ప్రియురాలిని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు యువకుడు ఫిర్యాదు చేశారు. అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో మేడికొండూరు అటవీప్రాంతంలో యువతి ఆచూకీ లభ్యమైంది. తనను ప్రేమ పేరుతో పాపారావు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని యువతి తెలిపింది. కళ్లకు గంతలు కట్టి తనను నలుగురు వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పింది. దీంతో నిందితుల కోసం గాలిస్తున్నారు.

Similar News