విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి
పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో గురువారం విషాదం నెలకొంది.
దిశ, ఉత్తరాంధ్ర : పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో గురువారం విషాదం నెలకొంది. ట్రాన్స్ ఫార్మర్ను తాకడంలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. ఏనుగుల గుంపు తివవ్వా కొండపైకి గుంపుగా వెళుతున్న సమయంలో ట్రాన్స్ ఫార్మర్ను తాకడంతో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు చెపుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఏనుగులు మృతిపై దర్యాప్తు చేపట్టారు. ఏడేళ్ల క్రితం అడవిలో నుంచి మైదాన ప్రాంతంలోకి వచ్చిన ఏనుగులు అప్పటి నుంచి అదే ప్రాంతంలో సంచరిస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఏనుగుల గుంపు ఒడిశా వైపు నుంచి వచ్చాయని అధికారులు భావిస్తున్నారు.
Also Read.
సైకో సీఎం మెడకు ఉరివేద్దాం.. కౌలు రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు : చంద్రబాబు