Kakinada: సంకురాత్రి చంద్రశేఖర్‌కు పద్మశ్రీ అవార్డు

కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. ...

Update: 2023-01-25 16:23 GMT

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. ప్రముఖ సాహితీ వేత్త చంద్రశేఖర్ సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రశేఖర్ భార్య ఇద్దరు పిల్లలు కెనడా ఉగ్రవాదుల బాంబు దాడిలో గతంలో మృతి చెందారు. నాటి నుంచి చంద్రశేఖర్ ప్రజా సేవకు అంకితమయ్యారు. 3 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయించారు. అందులో అధిక భాగం ఉచిత ఆపరేషన్లు చేయించారు. దీంతో సంకురాత్రి చంద్రశేఖర్‌కు భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. 

Similar News